Eto Vellipoyindhi Manasu : భర్తకి తన ప్రేమ విషయం చెప్పిన భార్య!
on Sep 20, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -205 లో.....శ్రీవల్లి ఇచ్చిన మత్తుతో రామలక్ష్మి స్పృహ తప్పి పడిపోతుంది. అయిన కూడా యాగం ఆపకండి. మీరు మంత్రాలు చదవండి అని స్వామి చెప్తాడు. సీతాకాంత్ రామలక్ష్మిని పట్టుకొని యాగం చేస్తుంటాడు. రామలక్ష్మి కాసేపటికి స్పృహలోకి వస్తుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి యాగం చేస్తారు. ఈ వస్త్రాలు కట్టుకొని రండి అని పంతులు చెప్తాడు.
ఆ తర్వాత అసలు నువ్వు మత్తు మాత్రలు వేసావా అని శ్రీవల్లిని శ్రీలత అడుగతుంది. వేసాను అత్తయ్య అని శ్రీవల్లి చెప్తుంది. అసలు అన్ని ప్లాన్ లు ఫెయిల్ అవుతూ వస్తున్నాయి అనుకుంటారు. ఇప్పుడు ఇది చివరి ప్లాన్ అని శ్రీలత అంటుంది. రౌడీకి ఫోన్ చేస్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి దగ్గరికి సిరి వెళ్లి మాట్లాడుతుంది. రామలక్ష్మి వస్తుంటే రౌడీ చూసి వదిలి పెట్టకూడదనుకుంటాడు. మరొకవైపు రామలక్ష్మి ఇక రాదని శ్రీవల్లి, శ్రీలత, సందీప్ లు అనుకుంటారు. కానీ రామలక్ష్మి రావడం చూసి షాక్ అవుతారు. మరొకవైపు సిరిని రౌడీ వెనకాల నుండి చూసి రామలక్ష్మి అనుకొని కత్తి తీస్తాడు. మొహం చూసి రామలక్ష్మి కాదని తెలిసి నగలు ఇవ్వమంటూ బెదిరిస్తాడు. దాంతో సిరి అరుస్తుంది. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. రౌడీ పారిపోతాడు. మాణిక్యానికి సిరి జాగ్రత్త అని చెప్పి రౌడీ వెనకాలే సీతాకాంత్ పరిగెడతాడు.
ఆ తర్వాత సీతాకాంత్ కోసం అందరూ వెయిట్ చేస్తుంటారు. రౌడీని సీతాకాంత్ కొడతాడు. సీతాకాంత్ ని రౌడీ కత్తితో పొడుస్తాడు. యాగం పూర్తి చెయ్యాలని నడుంకి సీతాకాంత్ గట్టిగా కట్టు కట్టుకొని వస్తాడు. మాణిక్యం ఏమైందని అడగడంతో ఎవరికి చెప్పొద్దని సీతాకాంత్ ప్రామిస్ వేస్తాడు. సీతాకాంత్ అలాగే యాగం దగ్గరికి వెళ్లి యాగం పూర్తి అయిన వెంటనే కింద పడిపోతాడు. తనకి ఉన్న రక్తం చూసి అందరు షాక్ అవుతారు. నీకు ఏమైనా అవుతుందోనని టెన్షన్ పడ్డా లక్కీగా నాకు అయిందని.. నువ్వు హ్యాపీగా ఉండాలని సీతాకాంత్ అనగానే.. ఇప్పుడు కూడా నా ప్రేమ విషయం చెప్పకుంటే నా ప్రేమకి అర్థం లేదని తన ప్రేమ విషయం సీతాకాంత్ కి చెప్తుంది రామలక్ష్మి. దాంతో సీతాకాంత్ హ్యాపీ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read